GK Bits In Telugu 5 Year 2025

By Gk Bits Telugu

Published On:

GK Bits In Telugu 5 Year 2025

Join WhatsApp

Join Now

GK Bits In Telugu 5 Year 2025 లో మొత్తం 10 ప్రశ్నలు ఉన్నాయి. ప్రతి ప్రశ్నకు 4 సమాధానాలు ఇవ్వబడ్డాయి. వాటిలో ఒకటి మాత్రమే సరియైనది. ప్రశ్నలన్నీ పూర్తయిన తర్వాత సరియైన సమాధానాలు ఇవ్వబడినాయి. అవసరమైనచోట వివరణలు కూడా ఉంటాయి.

GK Bits In Telugu 5 Year 2025 : ప్రశ్నలు

1. భారతదేశం సేంద్రియ వ్యవసాయంలో ప్రపంచంలో ఎన్నో స్థానంలో ఉంది ?

(ఎ) 6

(బి) 7

(సి) 8

(డి) 9

2. సేంద్రియ వ్యవసాయ పితామహుడిగా ఎవరిని పిలుస్తారు ?

(ఎ) సర్ ఆల్బర్ట్ హోవార్డ్

(బి) ఎం.ఎస్. స్వామినాథన్

(సి) సుభాష్ పాలేకర్

(డి) సర్ ఆర్థర్ కాటన్

3. భారతదేశంలో ‘పరంపరాగత్ కృషి వికాస్ యోజన’ అనే పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు ?

(ఎ) 2015

(బి) 2016

(సి) 2017

(డి) 2018

4. భారతదేశానికి ఏ దేశం నుంచి పసిడి అధికంగా దిగుమతి అవుతోంది ?

(ఎ) యూఏఈ

(బి) సింగపూర్

(సి) దక్షిణాఫ్రికా

(డి) అమెరికా

5. సీబీడీటీ (CBDT) ప్రస్తుత చైర్మన్ ?

(ఎ) అరవింద్ శ్రీవాస్తవ

(బి) రవి అగర్వాల్

(సి) ప్రబోధ్ సేథ్

(డి) రమేశ్ నారాయన్ పర్భాత్

6. ఏ రాష్ట్రంలో కొత్త అంతరిక్ష పార్కును ఇస్రో (ISRO) ఏర్పాటు చేయనుంది ?

(ఎ) కేరళ

(బి) తమిళనాడు

(సి) ఆంధ్రప్రదేశ్

(డి) ఒడిశా

7. లిక్విడ్ ఆక్సిజన్ మీథేన్ ఉపయోగించి ఏ సంవత్సరంలో చంద్రుడి పైకి మార్క్-3 రాకెట్ పంపేందుకు ఇస్రో ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ?

(ఎ) 2026

(బి) 2027

(సి) 2028

(డి) 2029

8. భారతదేశంలో ‘సివిల్ సర్వీసెస్ డే’ (Civil Services Day) ను ఏ తేదీన నిర్వహిస్తారు ?

(ఎ) ఏప్రిల్ 18

(బి) ఏప్రిల్ 19

(సి) ఏప్రిల్ 20

(డి) ఏప్రిల్ 21

9. ‘ది టాకింగ్ గన్స్ : నార్త్ ఈస్ట్ ఇండియా’ (The Talking Guns : North East India) పుస్తక రచయిత ?

(ఎ) వి.వి. లక్ష్మీనారాయణ

(బి) అజిత్ డోభాల్

(సి) నీరేంద్ర దేవ్

(డి) విక్రం మిస్త్రీ

10. భారతదేశంలో తొలి హైడ్రోజన్ రైలు ఈ సంవత్సరంలో ఏ నెల నుంచి పరుగులు తీయనుంది ?

(ఎ) జూన్

(బి) జులై

(సి) ఆగస్టు

(డి) సెప్టెంబర్

GK Bits In Telugu 5 Year 2025 : సరియైన సమాధానాలు

(1) డి

(2) ఎ

(3) ఎ

వివరణ :

సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, సేంద్రియ ఉత్పత్తులను మార్కెట్ తో అనుసంధానించడం అనేది ‘పరంపరాగత్ కృషి వికాస్ యోజన’ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. దీని కింద సేంద్రియ సాగు చేపట్టేందుకు రైతు సమాఖ్యలు ఏర్పడ్డాయి.

(4) బి

వివరణ :

మొత్తం బంగారం దిగుమతుల్లో సింగపూర్ దేశ వాటా 40%. ఆ తర్వాతి స్థానాల్లో యూఏఈ (16%), దక్షిణాఫ్రికా (10%) ఉన్నాయి. 2024-25 ఆర్ధిక సంవత్సరంలో మనదేశంలో మొత్తం పసిడి దిగుమతులు 58 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 5 లక్షల కోట్లు) కు చేరాయి. పరిమాణం పరంగా చూస్తే … 2024-25లో 757.15 టన్నుల పసిడి అధికారికంగా దిగుమతి అయ్యింది. మనదేశ మొత్తం దిగుమతుల్లో పసిడి వాటా 8% గా ఉంది.

(5) బి

(6) బి

వివరణ :

తమిళనాడులోని కన్యాకుమారిలో కొత్త అంతరిక్ష పార్కు ఏర్పాటు చేయనున్నట్లు ఇస్రో చైర్మన్ ‘నారాయణన్’ తెలిపారు.

(7) బి

వివరణ :

మార్క్-3 రాకెట్ ద్వారా 4,000 కిలోల బరువైన ఉపగ్రహాన్ని కూడా అంతరిక్షంలోకి పంపవచ్చు.

(8) డి

(9) సి

(10) బి

వివరణ :

2025 జులై నెలలో హరియాణా లోని జింద్ నుంచి సోనీపత్ మధ్య హైడ్రోజన్ రైలు నడవనుంది. చెన్నై లో తయారు చేస్తున్న ఈ రైలు పనులు తుది దశలో ఉన్నాయి.

Gk Bits Telugu

GK Bits Telugu provides exam-focused GK, current affairs, and study materials in Telugu for APPSC, TSPSC, DSC, SSC, RRB, IBPS and other competitive exams.

Leave a Comment